కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ప్రారంభమైన విపక్ష నేతల సమావేశం.. పక్కపక్కనే రాహుల్, చంద్రబాబు

  • భేటీకి హాజరైన పలు పార్టీల నేతలు
  • మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించి ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు
ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో బీజేపీయేతర పార్టీల సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కపక్కనే ఆసీనులయ్యారు. జాతీయ స్థాయిలో మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై వివిధ నేతలంతా చర్చిస్తున్నారు. మరోవైపు, ఈ ఉదయం అసెంబ్లీలో బీజేపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు... అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
maha ghatbandhan
delhi
Chandrababu
Rahul Gandhi

More Telugu News